ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు సినిమాలలో నటించడం మానేసి సినిమాలను చిత్రీకరించడం లో బిజీగా ఉన్నారు. గతంలో చాలా మంది అదే పనిలో ఉన్నారు. కానీ అనుపమ పరమేశ్వరన్ పేరు మాత్రం తెరపై ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ దర్శకత్వం చేయాలకుంటుంది. నాని ‘జెంటిల్ మేన్’ సినిమా ద్వారా పరిచయమైన నివేద థామస్, తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టేసింది. ఆ తరువాత చేసిన ‘నిన్నుకోరి’ .. ‘జై లవ కుశ’ సినిమాలు కూడా ఆమెకు భారీ విజయాలను అందించాయి. ‘118’ .. ‘ బ్రోచేవారెవరురా’ సినిమాలు కూడా ఆమె కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి.
అలాంటి నివేద థామస్ దృష్టి డైరెక్షన్ పై ఉందట. మొదటి నుంచి కూడా తనకి డైరెక్షన్ అంటే ఇష్టమనీ, అందువలన డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ ను కూడా పూర్తిచేశానని చెప్పింది. హీరోయిన్ గా కొంతకాలం చేసిన తరువాత, తాను మెగా ఫోన్ పడతానని అంది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాననీ, ఆ తరువాతనే సినిమా వైపు వస్తానని చెప్పింది. దర్శకురాలిగా కూడా రాణించగలననే బలమైన నమ్మకమే ఉందని అంది.ఇలా అన్న అమ్మడు పాపులర్ అవుతుందేమో చూడాలి…